Thursday, September 5, 2024

AP: న‌ర‌సాపురం ఎంపీడీవో మిస్సింగ్…

ఆంధ్ర‌ప్ర‌భ స్మార్ట్, విజ‌య‌వాడ : ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా నరసాపురం ఎంపీడీవోగా విధులు నిర్వ‌హిస్తున్న ఎం.వెంకటరమణారావు మిస్సింగ్ అయ్యారు. ఈ మేరకు ఆయ‌న భార్య కృష్ణా జిల్లాలోని పెన‌మ‌లూరు పోలీస్ స్టేష‌న్ లో ఇవాళ‌ ఫిర్యాదు చేశారు. కానూరు మహదేవపురం కాలనీలో ఎంపీడీవో వెంకటరమణారావు దంప‌తులు నివాస‌ముంటున్నారు…

సెల‌వు రోజుల్లో న‌ర‌సాపురం నుంచి ఇక్క‌డ‌కు ర‌మ‌ణారావు వ‌స్తుంటార‌ని ఆయ‌న భార్య తెలిపింది.. సోమ‌వారం ఉద‌యం మ‌చిలీప‌ట్నం వెళుతున్నాన‌ని చెప్పి వెళ్లిన ఆయ‌న ఇప్ప‌టి వ‌ర‌కు తిరిగి రాలేద‌ని పోలీసుల‌కు చేసిన ఫిర్యాదులో పేర్కొంది. దీంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేస్తున్నారు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement