Sunday, September 29, 2024

AP: కన్సల్టేటివ్ ఫోరం ఛైర్మన్‌గా నారా లోకేశ్…

అమరావతి: స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం, సీఐఐ భాగస్వామ్యంతో కన్సల్టేటివ్‌ ఫోరం ఏర్పాటు చేసింది. ఈ మేరకు పరిశ్రమల శాఖ జీవోను విడుదల చేసింది. ఫోరం ఛైర్మన్‌గా మంత్రి నారా లోకేశ్‌ వ్యవహరించనున్నారు.

రెండేళ్ల కాలపరిమితితో ఇది పనిచేయనుంది. పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యంగా ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఈ ఫోరం పనిచేయనుంది. ప్రభుత్వ శాఖలను ఆర్టీజీఎస్‌ శాఖ సమన్వయం చేయనుంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement