Saturday, September 14, 2024

Nandyala – సోదరుడిపై రోకలి బండతో దాడి చేసి… .

.నంద్యాల బ్యూరో – ప్రభ న్యూస్… నంద్యాల జిల్లా పరిధిలోని వెలుగోడు మండలం మోత్కూరు గ్రామంలో పసుపుల మల్లికార్జున్ (40) పై తమ్ముడు వరస అయినా శ్రీనివాసులు శనివారం రాత్రి 11 గంటల సమయంలో రోకలిబండతో దాడి చేశారు.

మల్లికార్జున అక్కడికక్కడే మృతి చెందాడు. మద్యం మత్తులో ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుడు మల్లికార్జున కు భార్య ఈశ్వరమ్మ ఒక కూతురు ఉన్నారు.

- Advertisement -

మృతుడి తల్లి బాలనాగమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వెలుగోడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement