Thursday, October 3, 2024

AP: మిజోరం గ‌వ‌ర్న‌ర్ తో నాగ్ భేటి …

విశాఖ‌ప‌ట్నం – సినీ హీరో అక్కినేని నాగార్జున ఈ రోజు మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబును కలిశారు.. షూటింగ్ కోసం విశాఖకు వచ్చిన ఆయన నేడు హరిబాబు ఇంటికి వెళ్లారు..

ఇటీవల అనారోగ్యానికి గురైన హరిబాబు విశాఖలోని తన స్వగృహంలో విశ్రాంతి తీసుకుంటుండగా ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు నాగార్జున.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.. అక్కినేని నాగార్జున తండ్రి అక్కినేని నాగేశ్వరరావుతో ఉన్న అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు గవర్నర్‌ కంభంపాటి హరిబాబు..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement