Saturday, October 19, 2024

Murder చిత్తూరులో యువకుడి దారుణ హత్య

చిత్తూరు, (ప్రభ న్యూస్ బ్యూరో) చిత్తూరులో గుర్తుతెలియని యువకుడు దారుణ హత్యకు గురయ్యాడు. యువకుడిని గుర్తు తెలియని వ్యక్తులు బండరాళ్లతో ముఖంపైన మోది హత్య చేశారు. మృతుడి వయసు 27 సంవత్సరాలు ఉండవచ్చు. చిత్తూరు సంతపేటలోని ఇందిరా నగర్ నుంచి వీరభద్ర కాలనీకి వెళ్లి మట్టి దారిలో యువకుడి మృత దేహాన్ని స్థానికులు కనుగొన్నారు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో చిత్తూరు సిఐ నెట్టి కంటయ్య తన సిబ్బందితో అక్కడికి చేరుకున్నారు.

మృతుడి వివరాల కోసం ప్రయత్నాలు చేసినా, ఎటువంటి ఆధారాలు లభించలేదు. మృతుడి వద్ద తమిళనాడు బస్సు టికెట్ ఉందని సిఐ నెట్టి కాంతయ్య తెలిపారు. అతడు ఎవరు అనే విషయాన్ని ఆరా తీయడానికి, మిస్సింగ్ కేసులు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నట్లు సీఐ వివరించారు. మృతుడి వివరాలు తెలిస్తే చిత్తూరు టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని కోరారు. మృతుడి వివరాలను, హత్యకు కారణాలను నిందితుల వివరాలను తెలుసుకోవడానికి చిత్తూరు పోలీసులు కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement