Thursday, September 12, 2024

Mudragada : ప‌ద్మ‌నాభ‌రెడ్డిగా మారిన ముద్ర‌గ‌డ‌.. గెజిట్ నోటిఫికేషన్ జారీ

2024 లోక్ సభ, ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో దేశ ప్రజల దృష్టి మొత్తం పిఠాపురంపై పడింది. ఇక్కడి నుంచి జనసేనాని పవన్ కల్యాణ్ పోటీ చేయడంతో దేశవ్యాప్తంగా చర్చ నడిచింది. పిఠాపురంలో పవన్ కల్యాణ్‌ గెలిస్తే తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానని సవాలు చేసిన ముద్రగడ పద్మనాభం అనుకున్నట్టే తన పేరు మార్చుకున్నారు. పిఠాపురంలో పవన్ గెలవగానే పేరెప్పుడు మార్చుకుంటున్నారంటూ సోషల్ మీడియా వేదికగా ట్రోలింగ్ మొదలైంది. కొంతమంది ఆయన ఫొటో పెట్టి నామకరణ మహోత్సవం కూడా జరిపించారు.

ట్రోలింగ్‌పై స్పందించిన ముద్రగడ తన పేరును పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నానని మీడియా ముఖంగా వెల్లడించారు. ఆ తర్వాత తన పేరును మార్చాలంటూ ఆయన ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. తాజాగా, ఆయన పేరును ముద్రగడ పద్మనాభం నుంచి ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చినట్టు పేర్కొంటూ గెజిట్ విడుదలైంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement