Thursday, September 19, 2024

AP: అప్పన్నను దర్శించుకున్న ఎంపీ సీఎం రమేష్

సింహాచలం, జూన్ 5 : సింహాచలం శ్రీ వరాహ లక్మీ నృసింహ స్వామిని అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు ఆయనకు సాదర స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్ల సన్నిధిలో కుటుంబ సమేతంగా సీఎం రమేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్, సింహాచలం దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు గంట్ల శ్రీనుబాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement