Saturday, September 14, 2024

AP: రాజ్య‌స‌భ స‌భ్య‌త్వానికి మోపిదేవి, బీద రాజీనామా..

వైసీపీకి ఇద్ద‌రు ఎంపీలు రాజీనామా చేశారు. సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి మోపిదేవి వెంకటరమణ రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రిజైన్ చేశారు. ఈమేరకు మరో ఎంపీ బీద మస్తాన్ రావు తో కలిసి రాజ్యసభ చైర్మన్ ను కలిసి, రాజీనామా లేఖను అందజేశారు.

అనంతరం వైసీపీకి గుడ్ బై చెబుతున్నట్లు మోపిదేవి వెంకటరమణ ప్రకటించారు. తన రాజీనామాకు చాలా కారణాలు ఉన్నాయన్న మోపిదేవి వెంకటరమణ.. చాలా రోజుల పాటు ఆలోచించాకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

గెలుపైనా ఓటమైనా స్థానిక రాజకీయాల్లో ఉండడమే తనకు ఇష్టమని చెప్పుకొచ్చారు. రాజ్యసభకు రావడం తనకు ఇష్టంలేదన్నారు. త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. టీడీపీలో తనకు ఎలాంటి బాధ్యతలు అప్పగిస్తారనేది త్వరలోనే తెలుస్తుందని చెప్పారు. తాను పదవుల కోసం పార్టీ మారలేదని ఈ సందర్భంగా మోపిదేవి స్పష్టం చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement