Friday, September 6, 2024

AP: జడ్పీ స‌ర్వ‌స‌భ్య‌ సమావేశంలో పాల్గొన్న‌ మంత్రులు..

కర్నూలు : జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జడ్పీ చైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి అధ్యక్షతన శుక్రవారం వ్యవసాయం, గ్రామీణ నీటి సరఫరా-పారిశుద్ధ్యం, నీటి పారుదల శాఖ, విద్యుత్తు శాఖ తదితర అంశాలపై జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు.

ఉమ్మడి కర్నూలు, నంద్యాల జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో రాష్ట్ర న్యాయ, మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి, ఎన్ఎండి ఫరూక్, రోడ్లు భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి, బీసీ జనార్దన్ రెడ్డి, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్, కర్నూలు జిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా, నంద్యాల జిల్లా కలెక్టర్ జి.రాజకుమారి గణియా, కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు, నంద్యాల పార్లమెంట్ సభ్యులు బైరెడ్డి శబరి, ఎమ్మెల్సీ మధుసూదన్, పాణ్యం శాసనసభ్యులు గౌరు చరిత, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ.శ్యామ్ బాబు, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, ఆదోని ఎమ్మెల్యే పార్థసారథి, ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి, నంద్యాల జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి, కర్నూలు, నంద్యాల జిల్లాల జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement