Monday, October 7, 2024

AP | వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి సవిత..

ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో : రాష్ట్ర బీసీ సంక్షేమం, ఆర్థికంగా వెనుక‌బ‌డిన వ‌ర్గాల సంక్షేమ శాఖ‌ మంత్రి ఎస్‌.స‌విత శుక్ర‌వారం విజ‌య‌వాడ‌, ఆటో నగర్ ఎలక్ట్రిసిటీ కాలనీలోని ప్ర‌భుత్వ వెనుక‌బ‌డిన త‌ర‌గ‌తుల సంక్షేమ బాలుర క‌ళాశాల వ‌స‌తిగృహాన్ని (విజ‌య‌వాడ‌-తూర్పు, సెంట్ర‌ల్‌) ఆక‌స్మికంగా త‌నిఖీ చేశారు.

విద్యార్థుల‌కు అందిస్తున్న భోజ‌నం రుచి చూశారు. విద్యార్థుల‌తో మాట్లాడి కెరీర్ ప‌రంగా ఉన్న‌తంగా ఎదిగేందుకు బాగా చ‌దువుకోవాల‌ని సూచించారు. ప్ర‌భుత్వం క‌ల్పిస్తున్న సౌక‌ర్యాల‌ను స‌ద్వినియోగం చేసుకోవాల‌న్నారు. విద్యార్థులతో కలిసి ఆమె భోజనం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement