Saturday, September 28, 2024

AP: పారిశుద్ధ్య కార్మికుల కాళ్లు కడిగిన మంత్రి సత్యకుమార్..

శ్రీ సత్యసాయి బ్యూరో, సెప్టెంబర్ 28 (ప్రభ న్యూస్) : స్వచ్ఛభారత్ నిర్మాణానికి పారిశుద్ధ్య కార్మికులే స్ఫూర్తి ప్రదాతలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణానికి చెందిన జె.ఆర్ సిల్క్స్ అధినేత జింక రామాంజనేయులు దుస్తులు మంత్రికి అందజేయగా, వాటిని ఎండీఏ కార్యాలయంలో శనివారం రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్య‌ కుమార్ యాదవ్ మున్సిపల్ కార్మికులకు దుస్తులు పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మున్సిపల్ కార్మికులు చేస్తున్న కృషిని ప్రశంసించారు. మీరు ప్రతిరోజు సమాజానికి అందించే సేవలు ఎంతో కీలకమైనవన్నారు. మీ సమర్థవంతమైన పనితీరు వల్లనే మన పట్టణాలు అభివృద్ధి చెందుతున్నాయ‌ని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా కార్మికుల సంక్షేమం, అభివృద్ధిపై మునుపటి కంటే మరింత దృష్టి పెట్టాలని మంత్రి పిలుపునిచ్చారు. అనంతరం మంత్రి గత 30 సంవత్సరాలుగా మున్సిపాలిటీలో పనిచేస్తూ అమూల్యమైన సేవలు అందించిన పారిశుద్ధ్య కార్మికులు ఎస్.సాలమ్మ, ఎం.పెద్ద నాగప్పల కాళ్లు కడిగారు.

ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు కేశవ, పార్థ, సంసన్, బీజేపీ నాయకులు డోలా రాజారెడ్డి, డి చర్లపల్లి నారాయణస్వామి, జింక చంద్ర, గోట్లూరు చంద్ర సాకే ఓబులేష్, కోటి బాబు, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement