Sunday, September 22, 2024

AP: మల్యాల వద్ద కృష్ణమ్మకు మంత్రి నిమ్మ‌ల‌ పూజలు..

కర్నూలు బ్యూరో : రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు క‌ర్నూలు జిల్లాలో ప‌ర్య‌టిస్తున్నారు. మ‌ల్యాల వ‌ద్ద కృష్ణ‌మ్మ‌కు మంత్రి నిమ్మ‌ల పూజ‌లు నిర్వ‌హించారు. ఈసంద‌ర్భంగా మంత్రికి ఘ‌న స్వాగ‌తం ల‌భించింది.

హంద్రీ నీవా ప్రాజెక్ట్ పనుల పరిశీలనలో భాగంగా కర్నూలు జిల్లాకు విచ్చేసిన ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ మంత్రి టి.జి. భరత్, కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజులు మర్యాదపూర్వకంగా కలసి పుష్పగుచ్చం అందజేశారు.

ఈ కార్య‌క్ర‌మంలో జిల్లా కలెక్టర్ పి.రంజిత్ భాషా, పత్తికొండ ఎమ్మెల్యే కె.ఈ. శ్యామ్ బాబు, పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరిత, ఎమ్మిగనూరు ఎమ్మెల్యే జయనాగేశ్వరరెడ్డి, కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరి, మాజీ రాజ్యసభ సభ్యులు టి.జి.వెంకటేష్, ఇతర జిల్లా నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement