Friday, October 18, 2024

AP | విశాఖ కోర్టుకు హాజ‌రైన‌ మంత్రి లోకేష్..

విశాఖపట్నం: తనపై ఓ పత్రిక రాసిన తప్పుడు కథనానికి సంబంధించి రాష్ట్ర విద్య, ఐటి శాఖల మంత్రి నారా లోకేష్ విశాఖ జిల్లా కోర్టుకు హాజరయ్యారు. 12వ అదనపు జిల్లా కోర్టు వాయిదాకు లోకేష్ హాజరయ్యారు. ఓ పత్రిక తప్పుడు కథనాలపై నారా లోకేష్ న్యాయ పోరాటం చేస్తున్నారు.

2019 అక్టోబర్ 22న ‘చినబాబు చిరుతిండి రూ. 25 లక్షలండి’ పేరుతో ఓ ప‌త్రిక‌ లో అసత్య కథనాన్ని ప్రచురించారు. అవాస్తవ కథనాలు ప్రచురించిన ఆ ప‌త్రిక‌ పై మంత్రి లోకేష్ రూ.75 కోట్లకు పరువు నష్టం దావా వేశారు. ఉద్దేశపూర్వకంగా తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించడంపై ఈ కేసు దాఖలు చేశారు. ఆగస్టు 29న తొలిసారి క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తయింది. ఈరోజు మరోసారి క్రాస్ ఎగ్జామినేషన్ కు మంత్రి హాజరయ్యారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement