Thursday, July 4, 2024

AP: తాటిపూడి రిజ‌ర్వాయ‌ర్ నుంచి నీటిని విడుదల చేసిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్

విజయనగరం : తాటిపూడి రిజర్వాయర్ నుంచి రాష్ట్ర ఎంఎస్ఎంఈ, సేర్ప్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సాగునీటిని విడుదల చేశారు. మూడు మండలాల్లోని 15,365 ఎకరాలకు 11 కాలువల ద్వారా నీరు విడుదల చేశారు.

ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ… రిజర్వాయర్ ను అన్నివిధాలా అభివృద్ధి చేసి, శివారు భూములకు కూడా సాగునీరందించేందుకు కృషి చేస్తానని, ఈ ప్రాంతాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్, ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి, ఇతర అధికారులు, నాయకులు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement