Thursday, September 19, 2024

AP | సీఎంతో ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధుల భేటీ

అమరావతి అభివృద్ధి ప్రణాళికలు, ప్రభుత్వ విజన్ పై ప్రపంచ బ్యాంకు, ఏడీబీ బ్యాంకు ప్రతినిధులతో చర్చలు జరిపినట్టు సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. భవిష్యత్ రాజధాని అమరావతిలో భాగస్వామ్యం కావాల్సిందిగా రెండు బ్యాంకులను ఆహ్వానించినట్టు వెల్లడించారు.

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణం కోసం కేంద్ర కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.15 వేల కోట్లు కేటాయించింది. కాగా, ప్రపంచ బ్యాంకు సహకారంతో ఆ నిధులను సమకూర్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు భేటీ అయ్యారు. అమరావతి నిర్మాణానికి నిధులు అందించే విషయమై చర్చించారు. ప్రాథమికంగా అమరావతిలో చేపట్టాల్సిన పనులు, దశలవారీగా నిధుల విడుదలపై సీఎంతో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు చర్చలు జరిపారు.

అమరావతి ప్రాజెక్టులో పనుల పురోగతి, క్షేత్ర స్థాయి పర్యటనలు, భూ సమీకరణ, మౌళిక సదుపాయాలు, పెట్టుబడుల అంశాలపై చర్చించారు. రాజధాని పరిధిలో ప్రభుత్వ ప్రాధాన్యత ప్రాజెక్టులు, విధాన నిర్ణయాలను ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులకు సీఎం చంద్రబాబు వివరించారు. సీఆర్డీఏ పరిధిలో క్షేత్ర స్థాయిలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించారు. ఈ నెల 27వ తేదీ వరకు ఏపీలో ప్రపంచ బ్యాంక్, ఏడీబీ ప్రతినిధులు పర్యటించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement