Tuesday, October 29, 2024

AP | సీఎం చంద్రబాబుతో అదానీ గ్రూప్ బృందాల భేటీ

ఏపీ ముఖ్య‌మంత్రి చంద్రబాబు నాయుడితో అదానీ ఎక్స్‌పోర్ట్స్‌ ఎండీ రాజేష్‌ అదానీ, అదానీ పోర్ట్స్‌ సెజ్‌ ఎండీ కరణ్‌ అదానీ బృందాలు భేటీ అయ్యాయి. ఈ సంద‌ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడి అవకాశాలపై విస్త్రృతంగా చర్చించారు. కీలక రంగాలపై అదానీ ప్రతినిధులు ప్రజంటేషన్‌ ఇచ్చారు ఓడరేవులు, మైనింగ్‌, రింగ్‌రోడ్డు, ఐటీ, ఏఐ, టూరిజం అవకాశాలపై సీఎంకు వివరించారు. అమరావతి పునర్నిర్మాణానికి సహకారం అందిస్తామని తెలిపారు. స్వర్ణాంధ్రప్రదేశ్‌ విజన్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement