Friday, September 6, 2024

Accident బస్సుతో బైక్ ఢీ…మెడికో దుర్మ‌ర‌ణం

కర్నూల్ నగరంలోని కేఎంసీ మెడికల్ కళాశాల సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మెడికల్ కళాశాల విద్యార్థి మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. సత్యసాయి జిల్లా, రోళ్ల మండలం, పిల్లిగుండ్లపల్లి గ్రామానికి చెందిన రంగనాథ్ రెడ్డి కుమారుడు తేజేశ్వర్ రెడ్డి( 22). కర్నూల్ మెడికల్ కళాశాలలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం ఉదయం. నందికొట్కూరు డిపోకు చెందిన ఎపి 39 టికే 0088 బస్సు నందికొట్కూరు నుండి. కర్నూల్ ఆర్టీసీ బస్టాండ్ కి వెళుతూ. బుధవార్ పేట పెట్రోల్ బంక్ సమీపంలో బస్సుకంటే వేగంగా బైక్ పై వెళుతూ బస్సును ఢీకొన్నాడు. దీంతో తలకు గాయమై అతను అక్కడికక్కడే మృతి చెందాడు. . ట్రాఫిక్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement