Saturday, October 19, 2024

AP | టెట్‌కు భారీగా దరఖాస్తులు… షెడ్యూల్‌ ప్రకారమే పరీక్షలు

ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తులు వెల్లువెత్తాయి. ఆగస్టు 3తో దరఖాస్తుల స్వీకరణ గడువు ముగియగా 4,27,300 మంది దరఖాస్తు చేసుకున్నారని పాఠశాల విద్యాశాఖ వెల్లడించింది. సెకండరీ గ్రేడ్ టీచర్ కేటగిరీలో పేపర్ 1-ఏ కోసం 1,82,609 మంది దరఖాస్తు చేసుకోగా…, పేపర్ 1-బి కి 2,662 మంది దరఖాస్తు చేసుకున్నారు.

స్కూల్ అసిస్టెంట్ టీచర్ కేటగిరీలో పేపర్ 2-ఎ లాంగ్వేజెస్‌కు 64,036 మంది, మ్యాథ్స్ & సైన్స్‌కు 1,04,788 మంది దరఖాస్తు చేసుకున్నారని అధికారులు తెలిపారు. సోషల్ స్టడీస్ కోసం 70,767 మంది అభ్యర్థులు, స్కూల్ అసిస్టెంట్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పేపర్ 2-బి కేటగిరీకి 2,438 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు.

ఇక‌ గతంలో నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారమే (అక్టోబర్ 3 నుంచి 20 వరకు) టెట్ పరీక్షలు నిర్వహిస్తామని…. అభ్యర్థులంతా సన్నద్ధం కావాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు వెల్లడించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement