Thursday, September 5, 2024

Markapuram – బోల్తాపడ్డ ట్రావెల్స్ బస్సు – ఇద్దరి దుర్మరణం

ఆంధ్రప్రభ , మార్కాపురం ).రోడ్డుపై గేదెలను తప్పించబోయి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు మృతి చెందారు. ఈ ప్రమాదం ఆదివారం ఉదయం జరిగింది. అనంతపురం వైపు వెళుతున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయపాలెం సమీపంలోకి రాగానే ఉదయం దాదాపు 4 గంటల సమయంలో (తెల్లవారుజాము) రోడ్డు పై గేదెలు అడ్డు వచ్చాయి. తెల్లవారుజామున కావటంతో గేదెలు ఆకస్మాత్తుగా కనబడటంతో బస్సు అదుపుచేయలేని డ్రైవర్ గేదెలను ఢీకొనటంతో బోల్తా పడింది.

ఈఘటనలో అనంతపురం జిల్లాధర్మవరం చెందిన శివయ్య (28) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. గాయపడిన మరో మహిళ కూడా చికిత్స కోసం తరలిస్తుండగా మృతిచెందింది. మృతి చెందిన మహిళ ప్రకాశం జిల్లా పెద్దారవీడు మండలం కలనూతలకు చెందిన లక్ష్మి గా గుర్తించారు.

మరో ఏడుగురు తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. ప్రమాద సమయంలో బస్సు లో 32 మంది ఉన్నట్లు చెబుతున్నారు. అయితే తక్కువ వేగంతో బోల్తా పడటంతో మిగిలిన వారంతా క్షేమంగా బయటపడి ఇతర వాహనాల్లో వెళ్లిపోయారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement