Thursday, September 12, 2024

AP | భారీ వ‌ర్షాలు… మారేడుమిల్లి ఘాట్ రోడ్డు మూసివేత..

చింతూరు : మారేడుమిల్లి ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు మోతుగూడెం ఎస్సై గోపాలరావు తెలిపారు. మూడు రోజుల నుండి కురుస్తున్న భారీ వర్షాలతో పాటు, మరో మూడు రోజుల పాటు తుపాను కారణంగా ఘాట్ రోడ్డుపై కొండచరియలు విరిగిపడే అవకాశం ఉన్నందున ప్రస్తుతం ఘాట్ రోడ్డును మూసివేస్తున్నట్లు తెలిపారు.

ఘాట్‌ రోడ్డుపైకి ఏ ఒక్క వాహనాన్ని అనుమతించబోమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకుని రాజమండ్రి, చింతూరు వచ్చే ప్రయాణికులు తమ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించారు. ఘాట్‌రోడ్డులో మళ్లీ ప్రయాణాలు ప్రారంభించే విషయాన్ని తెలియజేస్తామన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement