Sunday, September 15, 2024

AP | సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ మాదిగ

అమరావతి, ఆంధ్రప్రభ: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కలిశారు. శనివారం హైదరాబాద్‌ జూబ్లీ హిల్స్‌లోని ఏపీ సీఎం నివాసంలో చంద్రబాబును మంద కృష్ణ మాదిగ మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా మందకృష్ణకు శాలువా కప్పి చంద్రబాబు సత్కరించారు. ఇటీవల సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వెలువడిన నేపథ్యంలో పలువురు ముఖ్య నేతలను కలుస్తూ వర్గీకరణ అమలుకు సహకరించాలని కోరుతున్నారు. అదే అంశం పై ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన మంద కృష్ణ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆనాడు టీడీపీ హయంలోనే ఎస్సీ వర్గీకరణకు బాటలు పడ్డాయి.వర్గీకరణ అమలుకు మంద కృష్ణ మాదిగ చేసిన కృషి,పోరాటానికి సీఎం చంద్రబాబు అభినందించి శాలువాతో ఆయనను సత్కరించా

Advertisement

తాజా వార్తలు

Advertisement