Monday, October 21, 2024

AP | టీటీడీ నిత్యాన్నదానం తరహాలో అన్న క్యాంటీన్ల నిర్వహణ

ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభానికి సర్వం సిద్ధమవుతోంది. ఆగస్ట్ 15వ తేదీ నుంచి ఏపీలో వంద అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ప్రారంభించనుంది. అన్న క్యాంటీన్ల నిర్వహణపై కలెక్టర్లతో సమావేశంలో సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. టీటీడీ నిత్యాన్నదానం తరహాలోనే అన్న క్యాంటీన్లను నిర్వహించేలా ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు.

నిత్యాన్నదానం కోసం టీటీడీ.. భక్తులు ఇచ్చిన విరాళాలతో రూ. వేయి కోట్ల కార్పస్ ఫండ్ ఏర్పాటు చేస్తుందని.. ఈ తరహాలోనే దాతల నుంచి విరాళాలు సేకరించి అన్న క్యాంటీన్లను స్వయం సమృద్ధి సాధించి నిర్వహించేలా అధికారులు ప్రణాళికలు రచించాలని చంద్రబాబు సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement