Thursday, September 12, 2024

Flood Relief Fund | మహేష్ బాబు రూ.కోటి విరాళం

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల కారణంగా ఇరు రాష్ట్రాల ప్రజలు అల్లాడిపోయారు. ఈ క్రమంలో సినీ, రాజకీయ, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులు వరద బాధితుల సహాయార్థం విరాళాలు ప్రకటిస్తున్నారు. ఈ క్రమంలో టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. వరద బాధితులను ఆదుకునేందుకు రూ.కోటి భారీ సాయాన్ని ప్రకటించారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలకు రూ.50 లక్షల చొప్పున మహేష్ సాయం చేస్తానన్నారు.

వరద బాధితుల సహాయార్థం ఏపీ డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ళ్యాన్, ఎన్టీఆర్, బాలకృష్ణ కూడా కోటి రూపాయల భారీ సాయం అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement