Friday, September 20, 2024

AP | టోల్‌గేట్‌ వద్ద మాధురి కారు బోల్తా..

టెక్కలి వైఎస్ఆర్సిపి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ మాధురితో అక్రమ సంబంధం పెట్టుకున్నారని దువ్వాడ భార్య, కూతుర్లు ఆరోపిస్తున్నారు. వీరి వ్యవహారం రోజురోజుకు ముదురుతున్న వేళ తాజాగా దివ్వెల మాధురి కారు ఆదివారం ప్రమాదానికి గురైంది. పలాస మండలం లక్ష్మీపురం టోల్ గేట్ వద్ద ఆగి ఉన్న కారుని మాధురి కారు ఢీకొనడంతో ఆ కారులో ఉన్న మాధురి తీవ్ర గాయాలపాలైంది. దాంతో మాధురిని వెంటనే ఆమెను పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే, చనిపోవడానికి హైవే పైకి వచ్చానని… తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మాధురి అన్నారు. తన కూతుళ్లను కూడా ట్రోల్ చేస్తున్నారని తెలిపింది. తాను మానసికంగా కుంగిపోయానని, తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్న వాణిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేసింది. తనకు ఏమైనా జరిగితే వాణియే కారణమని చెప్పింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement