Saturday, October 19, 2024

AP | సీఐడీ చేతికి మ‌ద‌న‌ప‌ల్లె కేసు..

అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్ల దహనం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసును సీఐడీకి అప్పగించారు. మదనపల్లె ఫైళ్ల దహనం కేసును సీఐడీకి అప్పగిస్తూ డీజీపీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులు జారీ చేశారు. డీజీపీ నుంచి అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయానికి సీఐడీకి కేసు అప్పగిస్తున్నట్లు ఉత్తర్వులు అందాయి. మరో రెండు రోజుల్లో ఫైళ్ల దహనం కేసు ఫైల్‌ మొత్తాన్ని పోలీసులు సీఐడీకి అప్పగించనున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement