Tuesday, September 24, 2024

Machilipatnam – పందెం గెలిస్తే .. రెండు పళ్లు ఊడాయి


( ఆంధ్రప్రభ స్మార్ట్, మచిలీపట్నం ప్రతినిధి) మూడు వేలు పందెం కట్టు… లక్ష రూపాయలు పట్టుకెళ్లు అని బుకీ ఆఫర్ ఇవ్వగానే తన అదృష్టాన్ని పరిశీలించుకుంటే.. పంచెం గెలిచి రెండు పళ్లూ ఊడగొట్టించుకున్న ఓ పందెం రాయుడి కథ ఇది. మచిలీపట్నం నిజాంపేట్ కు చెందిన రామచంద్రరావు కు శుక్రవారం రాత్రి ఓ క్రికెట్ మ్యాచ్ లో గెలిస్తే లక్ష రూపాయలు ఇస్తానని బుకీ ఎర వేశాడు. అంతే రామారావు రూ.3వేలు పందెం కట్టాడు. అనూహ్యంగా రామారావు పందెం గెలిచాడు. బుకీని డబ్బులు అడుగాడు. సరే డబ్బులు ఇస్తాను అని బుకీ పిలిచాడు. ఇంకేముంది క్రికెట్ బ్యాట్ తో రామారావును బుకీ చితక్కొట్టాడు. బాధితుడు రెండు పళ్లూ ఊడిపోయాయి. గాయపడిన బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఆర్బీ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement