Thursday, September 5, 2024

Breaking: మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి హైకోర్టులో ఊరట…

వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లికి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది ఏపీ హైకోర్టు. ఈవీఎం ధ్వంసం కేసులో ఇచ్చిన బెయిల్‌ షరతులే వర్తిస్తాయన్న హైకోర్టు….మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి కి 3 కేసుల్లో ముందస్తు బెయిల్‌ ఇచ్చింది.

ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇచ్చిన సందర్భంలో జారీ చేసిన షరతులు ముందస్తు బెయిల్ కు కూడా వర్తిస్తాయని చెప్పింది హైకోర్టు. కాగా పోలింగ్‌ రోజున పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం పరిధిలోని పాల్వాయి గేటు పోలింగ్‌ కేంద్రంలో ఈవీఎంను ధ్వంసం చేసిన ఘటనను ఎన్నికల సంఘం సీరియస్‌గా తీసుకుంది. వివిధ సెక్షన్ల కింద ఆయనపై కేసులు నమోదు చేసిన పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టారు. ఈ నేపథ్యంలో పిన్నెల్లి.. ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేయ‌గా.. ఆయ‌న‌కు ఊర‌ట ల‌భించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement