Tuesday, September 17, 2024

Breaking: మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లికి బెయిల్..

మాచర్ల వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి భారీ ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసంతో సహా మూడు కేసుల్లో ఆయనకు షరతులతో కూడిన బెయిల్ ను ఏపీ హైకోర్టు మంజూరు చేసింది.

ఎన్నికల సమయంలో టీడీపీ ఏజెంట్, సీఐపై దాడి, ఈవీఎం ధ్వంసం కేసుల్లో పిన్నెల్లిని జూన్ 26న పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. దాదాపు రెండు నెలలుగా నెల్లూరు సెంట్రల్ జైలులో ఉంటున్నారు. షరతులతో కూడిన బెయిల్ ను కోర్టు మంజూరు చేసింది. పాస్ పోర్టు అప్పగించాలని కోర్టు పిన్నెల్లికి ఆదేశించింది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement