Saturday, October 19, 2024

AP: ఇంటర్ విద్యార్థినిని హత్య చేసిన ప్రేమోన్మాది..

కర్నూల్ బ్యూరో : కర్నూలు జిల్లా ఆస్పరి మండలం నగరూరులో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదని ఓ ప్రేమోన్మాది ఇంటర్ విద్యార్థిని చేత బలవంతంగా పురుగుల మందు తాగించి హత్య చేసిన ఘటన శనివారం వెలుగు చూసింది. బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అశ్విని అనే ఇంటర్ విద్యార్థిని పత్తికొండ మోడల్ స్కూల్ లో ఇంటర్ ఫస్టియర్ చదువుతుంది.

అయితే ఆ విద్యార్థినిని గత కొంతకాలంగా అదే గ్రామానికి చెందిన వీరేష్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. అయితే అతని ప్రేమను అశ్విని తిరస్కరించింది. కానీ తనను ప్రేమించాలని అశ్వినినీ వీరేష్ వేధింపులకు గురి చేస్తున్నాడు. ఈ క్రమంలో దసరా సెలవుల్లో అశ్విని ఇంటికి వచ్చింది. ఇదే ఆదనుగా భావించిన చిన్నవీరేష్ తనను ప్రేమించకపోతే చంపేస్తానని సదరు బాలికను బెదిరింపులకు గురి చేస్తూ వచ్చాడు. ఇక ఎవరూ లేని సమయంలో ఇంట్లోకి దూరి బాలికపై అత్యాచారం చేయడానికి ప్రయత్నించాడు..

బాలిక ప్రతిఘటించడంతో బలవంతంగా క్రిమిసంహారక మందు తాగించాడు… అయితే ఈ పెనుగులాటలో వీరేశ్ కు కూడా గాయాలయ్యాయి. ఇక, పొలం పనుల నుంచి వచ్చిన తల్లిదండ్రులకు చావు బతుకుల్లో కనిపించిన అశ్వినిని చూసి షాక్‌ తిన్నారు.. వెంటనే ఆదోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

- Advertisement -

కానీ, అప్పటికే అశ్విని మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.. దీంతో బాలిక తల్లిదండ్రులు కన్నీరు మున్నీరయ్యారు. ప్రేమ పేరుతో తన కూతురును వేధింపులకు గురి చేసి.. అత్యాచార యత్నం చేసి హత్య చేసిన ప్రేమోన్మాదిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement