Sunday, October 20, 2024

ల‌వ్ మ్యారేజీ ఎఫెక్ట్‌.. యువ‌కుడి ఇంటికి నిప్పుపెట్టిన యువ‌తి బంధువులు

కర్నూలు జిల్లాలో ఘోరం జ‌రిగింది. మంత్రాలయం మండలం మాధవరం గ్రామంలో ఉద్రిక్తత నెల‌కొంది. ల‌వ్ మ్యారేజీ విష‌యంలో ఈ ప‌రిస్థితి నెల‌కొన్న‌ట్టు తెలుస్తోంది. ఈ క్ర‌మంలో ఓ యువకుడి ఇంటికి యువతి బంధువులు నిప్పు పెట్టారు. ఈ నెల 9వ తేదీన‌ యువతితో మాధ‌వరం వాసి ప్రేమ పెళ్లి చేసుకున్నాడు.

అయితే ఆ యువతి బంధువులు దాడిచేస్తారని భ‌య‌ప‌డి ఇంటినుంచి పారిపోయాడు. దీంతో కోపోద్రిక్తులైన యువ‌తి బంధువులు అత‌ని ఇంటికి నిప్పంటించారు. దీంతో గ్రామాంలో ఉద్రిక్త వాతావ‌ర‌ణం నెల‌కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement