Friday, September 13, 2024

Kurnool | లారీ – బైక్ ఢీ : ఇద్ద‌రి దుర్మరణం..

కర్నూలు బ్యూరో : వెల్దుర్తి మండలం, మాదాపూర్ గ్రామం జాతీయ రహదారిపై ఈరోజు (శనివారం) రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు. డోన్‌కు చెందిన డేవిడ్‌పాల్‌, పాలెం జయకుమార్‌ మోటార్‌ బైక్‌పై డోన్‌ వైపు వెళ్తుండగా వెనుక నుంచి లారీ ఢీకొట్టింది.

దీంతో ఇరువురు అక్కడికక్కడే మృతి చెందారు. ఘటన అనంతరం లారీ డ్రైవర్ పరారయ్యారు. సమాచారం తెలుసుకున్న వెల్దుర్తి పోలీసులు ఘటన స్థలం చేరుకొని విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement