Tuesday, October 15, 2024

Leaders Voice – ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిన ఘనత వైసిపి ప్రభుత్వానిదే…

అనకాపల్లి,నవంబర్,09.సిఎం జగన్ చేస్తున్న మేలును చిన్నారులు సైతం గొంతెత్తి చెప్తున్నారని, ప్రతి సామాజిక వర్గానికి న్యాయం చేసిన ఘనత తమ ప్రభుత్వానిదని, అలీబాబా నలభై మంది దొంగల ముఠా టిడిపి నాయకులు అని డిప్యూటీ సీఎం బూడి ముత్యాలనాయుడు అన్నారు. దేశంలో మిగిలి రాష్ట్రాలు ఆంధ్రాలో జరుగుతున్న అభివృద్ధిని చూసి నివ్వెరపోతున్నాయని, సంక్షేమం కోసం పది అడుగులు ముందుకు వేసే నాయకులు సీఎం జగన్ అని,మహిళలకు, రైతులు, విద్యార్థులకు, పింఛను అందుకుంటున్న ప్రతి ఒక్కరు సిఎం జగన్ కావాలని కోరుకుంటున్నారని ఎంపీ సత్యవతి తెలిపారు. అనకాపల్లిలో సామాజిక సాధికార యాత్ర అట్టహాసంగా జరిగింది.తెగడ లో ఏర్పాటుచేసిన 240 ఇళ్లు కలిగిన జగనన్న హౌసింగ్ లేఅవుట్ (జగనన్న కాలనీ)ని ఉత్తరాంధ్ర జిల్లాల రీజనల్ కోఆర్డినేటర్ వై.వి.సుబ్బారెడ్డి, మంత్రులు ప్రారంభించి గృహప్రవేశం చేసి, మోడల్ స్కూల్లో జరిగిన నాడు- నేడు పనులను పరిశీలించారు

. ఆనంతరం ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో మాట్లాడారు. ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో నాయకులు పాల్గొని ప్రభుత్వం అందిస్తున్న సేవలపై ప్రసంగించారు. వేలకోట్ల రూపాయలతో అనకాపల్లి నియోజకవర్గం అందిస్తున్నామని స్వతంత్రం వచ్చిన తర్వాత గ్రామ స్వరాజ్యం ఏర్పాటు చేసిన ఏకైక ప్రభుత్వం వైసీపీ అని మంత్రి అమర్నాథ్ అన్నారు. స్త్రీ ప్రాముఖ్యతను చాటి చెప్పిన ప్రభుత్వం వైసీపీ అని, కేవలం నాలుగున్నర ఏళ్లలో చేసిన అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మారే రాష్ట్రంలో జరగలేదనీ రాజకీయ మార్పు అంటే ఒకరి చెప్పు చేతలలో ఇంకొకరు ఉండే విధానం కాదని చాటి చెప్పిన ప్రభుత్వం వైసీపీ అని మంత్రి ధర్మాన కృష్ణదాస్ తెలిపారు.బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి వైసిపి పాటుపడుతుంది కాబట్టే మన కుటుంబాలు గ్రామాలు బాగుపడుతున్నాయి డిప్యూటీ సీఎం పీడికి రాజన్నదొర సభానుద్దేసించి మాట్లాడారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement