Thursday, September 19, 2024

AP | జి ఏం ఆర్ , లలితా జ్యువెలర్స్ భారీ విరాళం….

ఏపీలో వరద బాధితుల సహాయం కోసం పలువురు ప్రముఖులు విరాళాలు అందించారు. ఈ క్ర‌మంలో లలితా జ్యువెలర్స్ అధినేత కిరణ్ కుమార్ సీఎం సహాయనిధికి కోటి రూపాయలు విరాళం ప్రకటించారు. ఈ మేరకు కిరణ్ కుమార్ సీఎం చంద్రబాబు నాయుడుని కలిసి చెక్‌ను అందించారు.

వరదలతో తీవ్రంగా నష్టపోయిన బాధితులను తిరిగి సాధారణ స్థితికి చేర్చేందుకు తమ వంతు సహకారం అందిస్తున్న వారికి సీఎం కృతజ్ఞతలు తెలిపారు.

నేడు విరాళాలు అందించిన వారి వివరాలు..

విశాఖపట్నానికి చెందిన జీఎమ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ చల్లా ప్రసన్న, సీఈఓ మనోమేరాయ్ రూ.2.5 కోట్లు, ఏఐజీ హాస్పిటల్స్ ఛైర్మన్ డాక్టర్ డి.నాగేశ్వరరెడ్డి రూ.1 కోటి, వెల్ జాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అధినేత వెలమాటి జనార్థన్ రావు రూ.1 కోటి చెక్కులను సీఎంకు అందించారు. మెప్మా తరపున తేజ్ భరత్ రూ.1 కోటి, ప్రసాద్ సీడ్స్ అధినేత ప్రసాద్ రూ.50 లక్షలు, తణుకు ఎమ్మెల్యే అరిమిల్లి రాధాకృష్ణ ఆధ్వర్యంలో సింగపూర్ ప్రవాస తెలుగువారు రూ.17.5 లక్షలు, సిద్ధార్థ మెడికల్ కాలేజీ పూర్వవిద్యార్థి డాక్టర్ అమ్మన్న రూ.15 లక్షలు, పాతపట్నం ఎమ్మెల్యే మామిడి గోవిందరావు రూ.10 లక్షలు, ఎన్ఆర్ఐలు సురేష్ మానుకొండ, ఉప్పు వినోద్ బాబు, వరదా అమర్ రూ.10 లక్షలు అందించారు.

- Advertisement -

.ఏపీ ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ నుంచి డాక్టర్ ఐ.బాబ్జి శ్యామ్ కుమార్ రూ.6 లక్షలు, బెస్ట్ ఆగ్రో లైఫ్ లిమిటెడ్ యాజమాన్యం సూర్యదేవరబాబు-వెంకట రమా ప్రసాద్ రూ.5 లక్షలు, వల్లూరి రవీంద్రనాథ్, తేజ్ రూ.5 లక్షలు, మండపేట రైస్ మిల్లర్స్ తరపున రూ.5 లక్షలు, ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్ తరపున రూ.1.5 లక్షలు, రోటరీ క్లబ్ తరపున రూ.75 వేలకు సంబంధించిన చెక్కులను ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు అందించారు.

మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రూ.5 లక్షలు, ది అలమూరు తాలూకా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ తరపున రూ.5 లక్షల చెక్కులను సీఎంకు అందజేశారు. తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం రూ.4 లక్షలు, టి.సతీశ్‌ రూ.3 లక్షలు, పాలడుగు పార్వతిదేవి రూ.3 లక్షలు, ప్రసాద్ నాయుడు రూ.2,00,116, గాంధీ రూ.2 లక్షల 16వేలు, కొత్తపల్లి గాంధీ రూ.1 లక్ష, కెవిఎస్వీ ప్రసాద్ రూ.1 లక్ష, యలమంచిలి విమలాబాయ్ రూ.1 లక్ష, తోటకూర రాజారత్నం బాబు రూ.1 లక్ష, టి.కిషోర్ కుమార్ రూ.1,11,116 లు అందించారు. గారపాటి శ్రీలక్ష్మీ రూ.1 లక్ష, పులి వెంకటేశ్వర్లు రూ.1 లక్ష, కె.ప్రభాకర్ రావు రూ.75 వేలు, కరణం పద్మజ బంగారపు ఉంగరం, దివ్యాంగుడు వి.బాబూరావు రూ.50 వేలు, కరుసల శైలజా రూ.50 వేలు, ఏ.బాలాజీ ప్రసాద్ రూ. 50 వేలు, జీఎన్.బీ.వీ.ప్రసాద్ రావు రూ.50 వేలు, చలసాని సుబ్బారావు రూ.40 వేలు, భార్గవి రూ.32 వేలు, జి.సాంబశివరావు రూ.10 వేలు, ఆర్.రాధాకృష్ణ రూ.10 వేలు విరాళంగా ఇచ్చారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement