Friday, September 13, 2024

KNL: వరద బాధితులకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే రూ.5లక్షల సహాయం

ఎమ్మిగనూరు : విజయవాడలో సంభవించిన వరదలకు ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ.జయ నాగేశ్వర్ రెడ్డి తనవంతుగా సహాయ సహకారాలు అందించారు. వరద బాధితులను ఆదుకునే నిమిత్తం తనవంతుగా రూ.5లక్షల చెక్కును అందజేస్తున్నట్లు ప్రకటించారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో బాధితులకు చేయూతనిచ్చేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు వరద బాధితులకు నిరంతరం అండగా ఉంటున్న విషయాన్ని గుర్తు చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement