Wednesday, September 18, 2024

AP: ఆస్పరి సమీపంలో వాహనం బోల్తా… ఒకరి మృతి…

కర్నూలు : కర్నూలు జిల్లా ఆస్పరి వద్ద రోడ్డు ప్రమాదం జ‌రిగింది. ఓ వాహనం బోల్తా పడి వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.

నంద్యాలకు చెందిన కొందరు ఆలూరు మీదుగా కర్ణాటకలోని కంపెనీకి వెళ్తుండగా ఆస్పరి సమీపంలో వారు వెళ్తున్న వాహనం బోల్తా పడింది. దీంతో వాహ‌నంలోని ఓ వ్యక్తి మృతిచెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement