Friday, September 20, 2024

KNL: ప్రేమించిన యువతి దక్కలేదని.. యువకుడి ఆత్మహత్య..

కర్నూలు బ్యూరో : తాను గాఢంగా ప్రేమించిన అమ్మాయి.. మరో పెళ్లి చేసుకుందని కలత చెందిన ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన కర్నూలు నగరంలో వెలుగుచూసింది. కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు వెల్లడించిన మేరకు వివరాలిలా ఉన్నాయి.


తెలంగాణ రాష్ట్రం, జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మండలం, కొంకల గ్రామం చెందిన అంగన్వాడీ టీచర్ పెద్ద కుమారుడు తెలుగు అశోక్ (25) ఇంటర్ చదివాడు. చదువు అనంతరం చెన్నై నగరంలోని ఓ బేకరి నందు క్యాషియర్ గా పనిచేస్తూ వచ్చాడు. కాగా అశోక్ శాంతినగర్ పోలీస్ స్టేషన్ లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న కురువ గోకారి కూతురు అయిన కురువ ఇందుని ప్రేమించాడు.

ఈ క్రమంలో ఏడాది క్రితం సొంత గ్రామం చేరుకున్న అశోక్ ఇంటివద్ద ఉంటూ ఇంటి నిర్మాణ పనులు చేస్తున్నాడు. అయితే తాను ప్రేమిస్తున్న యువతి ఇందుకు ఇటీవల పెళ్లి చేసేందుకు కుటుంబ సభ్యులు నిశ్చితార్థం చేశారు. కాగా ఈ విషయం అశోక్ కు తెలియగా.. నాటి నుండి మనోవేదనకు గురవుతూ వచ్చాడు.

- Advertisement -

ఎవ్వరితో మాట్లాడకపోవడం, సరైన సమయానికి భోజనం తినకపోవడం, ఒంటరిగా ఉండడం అలవాటు చేసుకుంటూ వచ్చాడు. ఒక్కొక్కసారి తల్లి ఫోన్ చేసినా లిఫ్ట్ చేసేవాడు కాదు. ఈ క్రమంలో ఈనెల 24వ తేదిన ఉదయం అశోక్ ఇంటి నుండి బయటకు వెళ్లాడు. ఆ తర్వాత స్నేహితుడు నవీన్ తో కలిసి కర్నూల్ నగరంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గల జేఆర్ నాయుడు డీలక్స్ లాడ్జిలో రూమ్ నెంబర్ 106 దిగారు.

ఆ తర్వాత తన స్నేహితునికి ఇంటి నుంచి డబ్బు తేవాలని నవీన్ ను పంపి లాడ్జిలోని ఫ్యాన్ కు ఉరి వేసుకుని అశోక్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న నవీన్ కుటుంబ సభ్యులకు సమాచారం చేరవేశాడు. వారిచ్చిన ఫిర్యాదు మేరకు నాలుగో పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. అత‌ని తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement