Sunday, September 8, 2024

KNL: శ్రీశైలం మల్లన్న సన్నిధిలో మంత్రి కొప్పుల దంపతులు

తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు ఇవాళ ఉదయం శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారిని దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికారు.

అనంతరం స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. మంత్రి వెంట కరీంనగర్ ఉమ్మడి జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement