Friday, October 18, 2024

కుక్కల దాడిలో జింక మృతి

కర్నూలు జిల్లా బనగానపల్లె నియోజకవర్గం, సంజామల మండలం పరిధిలోని, ముదిగేడు గ్రామ సమీపంలో బుధవారం ముదిగేడమ్మ గుడి వద్ద కుక్కల దాడిలో జింక మృతి చెందింది. కొండ ప్రాంతం నుంచి గుడి వద్దకు చేరుకొని జింక మంచినీరు సేవిస్తుండగా.. కుక్కలు వెంట పడ్డాయి. చుట్టుముట్టి కరవడంతో జింక అక్కడికక్కడే మృతి చెందింది. సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టిన పోలీసులు, అటవీ శాఖ‌ అధికారులకు సమాచారమందించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement