Saturday, September 21, 2024

AP: కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్లలో కార్డన్ సెర్చ్..

కర్నూలు, సెప్టెంబర్ 21 : కర్నూలు జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్ ఆదేశాల మేరకు కర్నూల్ డీఎస్పీ బాబు ప్రసాద్, పత్తికొండ డీఎస్పీ వెంకటరామయ్యల ఆధ్వర్యంలో కర్నూలు, పత్తికొండ సబ్ డివిజన్లలో శనివారం తెల్లవారుజామున పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. రౌడీషీటర్లు, అనుమానస్పద వ్యక్తుల ఇళ్ళల్లో దాడులు నిర్వహించారు.

సారా, అక్రమ మద్యం విక్రయించే వారిని, మట్కా ఆడే వారిని అదుపులోకి తీసుకున్నారు. కర్నూలులోని శరీన్ నగర్ లో, పత్తికొండ పట్టణంలో ఎలాంటి ధ్రువపత్రాలు లేని 25బైక్ లు స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement