Sunday, September 8, 2024

KNL: యాచకుడి దారుణ హత్య..

కర్నూల్ నగరంలోని రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం యాచకుడు దారుణ హత్యకు గురయ్యాడు. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం పెద్దమూడం గ్రామానికి చెందిన శ్రీరామాచారి స్థానికంగా బిక్షాటన చేసి జీవనం సాగిస్తున్నాడు.

ఈ క్రమంలో బిక్షాటన ముగించుకొని రాత్రి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వీధిలో నిద్రిస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు అతనిపై రాయితో దాడి చేసి హత్య చేశారు. రెండవ పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. చిన్న ఘర్షణ మూలంగా హత్యకు దారి తీసినట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement