Sunday, September 8, 2024

KNL: నాటుసారా స్థావరాలపై దాడులు… 2,400 లీటర్ల బెల్లంఊట ధ్వంసం

జిల్లా ఎస్పీ జి.కృష్ణకాంత్ ఆదేశాల మేరకు కర్నూలు సబ్ డివిజన్ డీఎస్పీ కరణం విజయ శేఖర్ ఆధ్వర్యంలో కర్నూలు రెండవ పట్టణ పోలీసులు, సెబ్ పోలీసులు కలిసి కర్నూలు బంగారు పేటలో ఇవాళ ఉదయం నాటు స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ దాడుల్లో 2, 400 లీటర్ల నాటు సారా బెల్లంఊటను ధ్వంసం చేశారు.

అలాగే 150 లీటర్ల నాటు సారా, 100 కేజీల నల్లబెల్లంను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో కర్నూలు డీఎస్పీతో పాటు కర్నూలు టు టౌన్ సిఐ ఇంథియాజ్ భాషా, కర్నూలు ఒకటవ పట్టణ సిఐ పవన్ కుమార్, కర్నూలు నాల్గవ పట్టణ సిఐ శంకరయ్య, కర్నూలు సెబ్ సిఐ నరసనాయుడు, మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్. విశ్వేశ్వర రెడ్డి, టు టౌన్ ఎస్సై శ్రీధర్ బాబు, సెబ్ ఎస్సై రెహనా బేగం, మున్సిపల్ శానిటరీ సూపర్ వైజర్ నాగరాజు, శానిటరీ ఇన్స్ పెక్టర్లు ముర్తుజావళి, మునిస్వామి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement