Monday, October 7, 2024

KNL: చంద్రబాబుపై దాడి… కేసు నమోదు చేయాలంటున్న టీడీపీ

కర్నూలు బ్యూరో : సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా శుక్రవారం కర్నూలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎదుట టీడీపీ శ్రేణులు నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం వ్యవస్థాపకులు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు.

ఈ సందర్భంగా టీడీపీ జిల్లా అధ్యక్షులు తిక్కారెడ్డి మాట్లాడుతూ… తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు 2023 ఆగస్టు 4న అన్నమయ్య జిల్లాలో పర్యటించిన సంద‌ర్భంగా అంగళ్ళులో చంద్రబాబు నాయుడుపై దాడి చేసిన వైసీపీ నాయకులను గుర్తించి కేసులు నమోదు చెయ్యాలని, ప్రస్తుత సీఎం చంద్రబాబునాయుడు, టీడీపీ కార్యకర్తలు, నాయకులపై తప్పుడు కేసులు పెట్టిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు.

రాష్ట్ర తెలుగు యువత అధ్యక్షులు శ్రీ రాం చిన్నబాబు, కర్నూలు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యస్.అబ్బాస్, పర్వీన్ తాజ్, దొరస్వామి నాయుడు, రాష్ట్ర పార్టీ కార్యదర్శి వై.నాగేశ్వర రావు యాదవ్, తెలుగు యువత నాయకులు రవి కుమార్, పేరపోగు రాజు, కురువ పరమేశ్, ఎల్.వి.ప్రసాద్, గట్టు తిలక్ మొదలగు వారితో కలిసి కర్నూలు నగరంలోని డి.ఐ.జి కార్యాలయంలో డి.ఐ.జి కోయ ప్రవీణ్ ను కలిసి వినతిపత్రం అందజేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement