Sunday, September 22, 2024

AP | అనుమానాస్పద స్థితిలో విద్యార్థి మృతి…

ఆత్మకూరు, ప్రభ న్యూస్ : కొత్తపేటకు చెందిన విద్యార్థిని కిడ్నాప్‌కు గురై శవమై కనిపించిన ఘటన గురువారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొత్తపేటకు చెందిన ఇంటర్మీడియట్ విద్యార్థి వాహిద్ (20) మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురయ్యాడని, అతని తండ్రి షేక్ అజ్మతుల్లా ఫిర్యాదు మేరకు ఈ నెల 13న కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

ఈ కేసుకు సంబంధించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతుండగా గురువారం వాహిద్ మృతదేహం లభ్యమైంది. పట్టణ శివారులోని సిద్దపల్లె రస్తాలోని బావిలో వాహిద్ మృతదేహం లభ్యమైనట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.

మృతదేహాన్ని బయటకు తీసేందుకు బంధువులు ఎవరూ సహకరించకపోవడంతో టీడీపీ నాయకుల సహకారంతో మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి ప్రేమ వ్యవహారమా లేక హత్యా లేక ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement