Saturday, September 14, 2024

AP | పెన్షన్ల పంపిణీ లో కర్నూలు టాప్…

కర్నూలు బ్యూరో : సెప్టెంబర్ నెలలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లా అగ్ర‌స్థానంలో నిలిచింది. కర్నూలు జిల్లాలో మొత్తం 2 లక్షల 42 వేల 583 పింఛన్లు ఉండగా అందులో 2 లక్షల 41 వేల 293 పింఛన్లు పంపిణీ చేసి.. 99.47 శాతంతో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. గత ఆగస్టులో కూడా 98.03 శాతం పింఛన్ల పంపిణీతో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. కాగా, పింఛన్ల పంపిణీలో కర్నూలు జిల్లా వరుసగా రెండు నెలలుగా అగ్రస్థానంలో నిలవడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement