Saturday, October 19, 2024

Kurnool – రైలు కిందపడి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య…

కర్నూలు జిల్లా (ఆదోని) ఆదోని… రైలు కిందపడి మోహన్ బాబు బీటెక్ కళాశాలలో రెండవ సంవత్సరం చదువుతున్న ఈశ్వర్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదోని, నగరూరు రైల్వే స్టేషన్ల మధ్య చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదోని మండల పరిధిలోని పెసలపాడు గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు తన కుటుంబంతో ఆదోని పట్టణ పరిధిలోని మంజునాథ్ ఎస్టేట్లో నివాసం ఉంటున్నాడు అయితే జీవితం పై విరక్తి కలిగి ఈశ్వర్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు కాగా నిత్యం సెల్ఫోన్తో కాలయాపన చేస్తుండగా తండ్రి మందలించినందుకు ఆత్మహత్యకు పాల్పడినట్లు సమాచారం.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement