Monday, July 8, 2024

AP: సీనియర్ జర్నలిస్ట్ ఉపేంద్ర బాబు మృతి..

ఐజేయూ, ఏపీయూడబ్లూజే నేతల సంతాపం..
(ఎన్టీఆర్ ప్రభ న్యూస్ బ్యూరో) : సీనియర్ జర్నలిస్టు, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర మాజీ అధ్యక్షుడు గారపాటి ఉపేంద్ర బాబు (88) శుక్రవారం తెల్లవారుజామున మృతిచెందారు. ఆయన గత కొంతకాలంగా పార్కిన్సన్ వ్యాధితో బాధపడుతున్నారు. మరణవార్త తెలియగానే ఏపీయూడబ్లూజే విజయవాడ యూనిట్ అధ్యక్షుడు చావా రవి, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కంచల జయరాజ్, ఐజేయూ కౌన్సిల్ సభ్యుడు షేక్ బాబు, సీనియర్ నేతలు గరికపాటి రవి కుమార్, పొట్లూరి వెంకట్రావు, కృశ్చేవ్, సురేష్ బాబు తదితరులు విజయవాడ నగరానికి సమీపంలోని ఆయన స్వగ్రామమైన కాసరనేని వారి పాలెం వెళ్లి ఉపేంద్ర బాబు భౌతికకాయాన్ని సందర్శించి శ్రద్ధాంజలి ఘటించారు.

అనంతరం అంతిమయాత్రలో పాల్గొన్నారు. ఉపేంద్ర బాబు 1976 -78 కాలంలో రెండుసార్లు ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేశారు. 1961లో ఓ పత్రికలో సబ్ ఎడిటర్ గా జర్నలిస్టు ప్రస్థానాన్ని ప్రారంభించిన ఉపేంద్ర బాబు, రిటైర్ అయ్యే వరకు దానిలోనే కొనసాగుతూ అసిస్టెంట్ ఎడిటర్ హోదాలో పదవీ విరమణ చేశారు.

ఐజేయూ, ఏపీయూడబ్ల్యూజే నేతల సంతాపం…
ఉపేంద్ర బాబు మృతి పట్ల ఐజేయూ అధ్యక్షులు, తెలంగాణ ప్రభుత్వ మీడియా అకాడమీ చైర్మన్ కె.శ్రీనివాస్ రెడ్డి, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమ సుందర్, కార్యవర్గ సభ్యులు ఆలపాటి సురేష్ కుమార్, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు ఐ. వి. సుబ్బారావు, ప్రధాన కార్యదర్శి చందు జనార్ధన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతి పత్రికా రంగానికి, యూనియన్ కు తీరని లోటుగా పేర్కొన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపాన్ని, సానుభూతిని తెలిపారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement