Friday, September 13, 2024

AP: కార్యకర్తకు చెప్పులు తొడిగిన ఎమ్మెల్యే కొలికపూడి..

చంద్రబాబు సీఎం కావాలంటూ శపథం చేసిన మారేశ్వరరావు..
ఐదు సంవత్సరాలుగా చెప్పులు లేకుండానే జీవనం…
చెప్పులు తొడిగి ఔన్నత్యాన్ని చాటుకున్న ఎమ్మెల్యే కొలికపూడి..

(ప్రభ న్యూస్, ఎన్టీఆర్ బ్యూరో) : చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యేంత వరకు తాను చెప్పులు వేసుకోనంటూ శపథం చేసి ఐదు సంవత్సరాలుగా ఆచరించిన కార్యకర్తకు చెప్పులు తొడిగి ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తన ఔన్నత్యాన్ని చాటుకున్నారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాతే చెప్పులు వేసుకుంటానని శపథం చేసిన టీడీపీ విరాభిమానికి తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు తిరువూరు మార్కెట్ నందు చెప్పులు తొడిగారు.

2019 సంవత్సరంలో టీడీపీ పరాజయం చెంది చంద్రబాబు ముఖ్యమంత్రి పదవి నుంచి వైదొలగడంతో నిరాశ చెంది మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాతే చెప్పులు వేసుకుంటానని వల్లంపట్ల ఐ టీడీపీ ఛాంపియన్ గాడిచర్ల మారేశ్వరరావు అనే చిరు వ్యాపారి శపథం చేసుకున్నాడు. ఆయన తిరువూరులోని రైతు బజార్ లో కూరగాయలు అమ్ముకుంటూ చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్నాడు. మంగళవారం స్వయంగా నరేష్ ను కలిసిన ఎమ్మెల్యే కొలికిపూడి శ్రీనివాసరావు ఆయనకు చెప్పులు తొడిగారు. గత 20సంవత్సరాల నుంచి తిరువూరులో టీడీపీ విజయం చెందటం చూడలేదని కొలికపూడి రాకతో తిరువూరులో టీడీపీ జెండా రెపరెపలాడిందని ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావును పట్టుకొని మరేష్ బాగోద్వేగానికి గురయ్యాడు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement