Thursday, July 4, 2024

AP: జాతీయ రహదారిపై రైతులు ఆందోళన… న్యాయం చేయాలంటూ ఆగ్రహం..

పెనుగంచిప్రోలు, జులై 2 (ప్రభ న్యూస్): ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండల పరిధిలోని తోటచర్ల వద్ద రైతులు ఆందోళన నిర్వహించారు. జాతీయ రహదారిపై ఎడ్లబండ్లు అడ్డుగా ఉంచి రైతుల నిరసన తెలిపారు. మండల పరిధిలోని వెంకటాపురం, కొల్లికూల్ల గ్రామాలకు చెందిన 50మంది రైతులు తమకు న్యాయం చేయాలంటూ ఆందోళన నిర్వహించారు. సుమారు గంటకు పైగా రైతుల రోడ్డుపై బైఠాయించడంతో జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది.

వెంటనే స్థానిక పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని రైతులకు నచ్చజెప్పి ట్రాఫిక్ ను క్రమబద్ధీక‌రించారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ… కంచికచర్లకు చెందిన మిర్చి వ్యాపారి తమ వద్ద పంటను కొనుగోలు చేసి డబ్బులు చెల్లించకుండా వేధిస్తున్నాడని, దీనిపై పలుమార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినా తమకు న్యాయం జరగట్లేదంటూ రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు రూ.కోటి మేర డబ్బులు రైతులకు వ్యాపారి వద్ద నుండి రావాలని తక్షణం సంబంధిత శాఖ అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement