Friday, September 20, 2024

గుడివాడ శివ‌రాత్రి మ‌హోత్స‌వాల‌లో జ‌గ‌న్..

గుడివాడ: స‌్థానిక‌ ఎన్టీఆర్‌ స్టేడియంలో మంత్రి కొడాలి నాని ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శివరాత్రి మహోత్సవాల‌లో ముఖ్య‌మంత్రి జ‌గ‌న్ పాల్గొన్నారు.. ముందుగా ఆయ‌న శివలింగాన్ని అభిషేకించారు. మహాశివుడికి నమస్కరించారు. మహాశివలింగానికి పూలమాల, రుధ్రాక్ష మాల సమర్పించారు.పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.. అనంతరం వేద పండితులు ఆశీర్వచనం , తీర్థ ప్ర‌సాదాల‌ స్వీకరించారు.ఈ కార్య‌క్ర‌మంలో మంత్రులు కొడాలి నాని, వెల్లంపల్లి శ్రీనివాస్, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ బాలశౌరి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement