Friday, September 20, 2024

కౌంటింగ్ కు అంతా సిద్ధం

ఉయ్యూరు: 10 తేదీ జరిగిన నగర పంచాయతీ ఎన్నికలకు కౌంటింగ్ ప్రక్రియ ఆదివారం (నేటి)ఉదయం నుండి మొదలు కానుంది. నగర పంచాయతీ అధికారులు, పోలీస్ శాఖ అధికారులు కౌంటింగ్ ప్రక్రియ కు సంబంధించిన ఏర్పాట్లు మొత్తం శనివారం నాటికి పూర్తి చేశారు. 18 వార్డులకు 36 పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ కౌంటింగ్ ప్రక్రియ లో 9 టేబుల్లను సిద్ధం చేశారు. 18 వార్డులను నాలుగు రౌండ్ల లో పూర్తిచేసే విధంగా అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. 1 నుండి 9 వార్డులకు 2 రౌండ్లలో, 10 నుండి 18 మిది వార్డులకు గాను 2 రౌండ్లలో మొత్తం 4 రౌండ్లలో కౌంటింగ్ ప్రక్రియ జరగనుందని నగర పంచాయతీ అధికారులు, పోలీస్ అధికారులు తెలిపారు.కౌంటింగ్ కు సంబంధించిన ఏర్పాట్లను విజయవాడ కమిషనరేట్ డిజిపి హర్ష వర్ధన్ రాజు శనివారం పరిశీలించి స్థానిక సీఐ నాగ ప్రసాద్ వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కౌంటింగ్ ప్రక్రియకు బందోబస్తు గా 1 ఎ .సి .పి ముగ్గురు సీఐలు 8 మంది ఎస్సైలు 164 మంది పోలీస్ సిబ్బంది పాల్గొననున్నారని సి. ఐ సి.హెచ్ నాగ ప్రసాద్ తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement